2018 జులై 31 ఉదయం 60 పైచిలుకు వడ్డెర ఇళ్లను ప్రభుత్వం ఏ నోటీసు లేకుండా కూల్చేశారు. వారి కష్టాలను, వారి మాటల్లో వినాలని ఈ ప్రయత్నం చేసాను. వడ్డెరలకు చెప్పుకునే దిక్కు లేదనే ఇంత దుర్మార్గంగా ఇళ్లు కూల్చేశారని చెప్ప వచ్చు. వీరికి న్యాయం చేసి ప్రత్యామ్నాయ ఇళ్ళు మరియు వసతులు కల్పించే వరకు అందరం పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.